వేం నరేందర్రెడ్డిని మరోసారి విచారించనున్న ఏసీబీ!

వేం నరేందర్రెడ్డిని మరోసారి విచారించనున్న ఏసీబీ! - Sakshi


హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డిని ఏసీబీ మరోసారి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరైన ఆయన్ను మంగళవారం ఏసీబీ విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఓటకు నోటు వ్యవహారంలో గతనెలలో ఏసీబీ అధికారులు వేం నరేందర్ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వేం నరేందర్ రెడ్డిని జూన్ 17వ తేదీ రాత్రి అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లినా.. తన ఆరోగ్యం బాగోలేదని, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పి మరుసటి రోజు ఉదయం ఆయన ఏసీబీ మందు హాజరయ్యారు.



ఇదిలా ఉండగా, ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు సోమవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. సుమారు ఏడు గంటలపాటు ఆయనను  ప్రశ్నించిన అనంతరం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top