అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఇంటిపై ఏసీబీ దాడులు


హైదరాబాద్ : ఓ అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ గోపాల్ ఇంట్లో శుక్రవారం ఉదయం ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రూ.కోట్లలో ఆయనకు అక్రమ ఆస్తులున్నట్లు ఆరోపణలున్నాయ. ఈ మేరకు ఆయనకు సంబంధించిన కార్యాలయాలు, నివాసాలలో అధికారులు సోదాలు చేస్తున్నారు. అంబర్ పేటలో 600 గజాల ప్లాట్, నల్లకుంటలో 800 గజాల ప్లాట్, షాద్నగర్లో 15 ఎకరాలు, మల్కాజ్గిరిలో 6 ప్లాట్లు, హయత్నగర్ 10 ప్లాట్లున్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడింది. ఆయన అక్రమ ఆస్తుల విలువ సుమారు రూ.150 కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top