ఏసీబీకి చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఏఈ
హైదరాడాద్ : వరంగల్ జిల్లా హన్మకొండలో గిరిజన సంక్షేమ శాఖ ఏఈ ఏసబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏఈ వెంకన్న ఓ వ్యక్తి నుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటూ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు వెంకన్న ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నారు.