బాలికల సంక్షేమ హాస్టల్ పై ఏసీబీ దాడి


బెల్లంపల్లి(ఆదిలాబాద్): తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. కొందరు విద్యార్థుల ఫిర్యాదు మేరకు చేసిన ఆకస్మిక తనిఖీల్లోనాణ్యమైన భోజనం అందించడంలే దని వారు గుర్తించారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా, బెల్లంపల్లిలో జరిగింది. ఈ సందర్భంగా వారు నిర్వాహకులును విచారించడంతో పాటు, స్టాక్ రిజిస్టర్‌లో తప్పుడు సమాచారాన్ని నమోదు చేసినట్లు కనుగొన్నారు. స్టాక్ రిజిస్టర్‌ను తమ వెంట తీసుకెళ్లారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ వేణుగోపాలు, కానయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top