ఆదిలాబాద్ జిల్లా పేరును మార్చండి: సోనేరావు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా పేరును గిరిజనల కోసం పోరాటం సాగించిన ఉద్యమ నేత కొమరం భీమ్ పేరుగా మార్చాలని ఆయన మనవడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి విజ్క్షప్తి చేశారు. సచివాలయంలోని సీఎం కార్యాలయంలో కేసీఆర్ ను కొమరం భీమ్ మనవడు సోనే రావు కలిసి విజ్క్షాపన పత్రాన్ని సమర్పించారు.
వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్దికి, గిరిజనుల అభివృద్ధికి, సంక్షేమానికి మరిన్ని పథకాలను ప్రారంభించాలని కేసీఆర్ కు సోనేరావు సూచించారు.