కలెక్టరేట్ ఎదుట ఆదర్శ రైతుల ధర్నా


ఆదిలాబాద్ అర్బన్ : ఆదర్శ రైతుల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఆదర్శ రైతులు ధర్నా నిర్వహించారు. అంతకుముందు కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలివచ్చారు. రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జీవో120 రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఆదర్శ రైతుల వ్యవస్థపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవగాహన లేదని, అందుకే రద్దు చేశారని ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కట్కూరి సత్తయ్య  విమర్శించారు.



రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ముట్టడి చేపట్టామని తెలిపారు. ఇకనైనా రైతులకు అందుబాటులో ఉండి సలహాలు అందించే ఆదర్శ రైతుల వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆదర్శ రైతులకు గౌరవ వేతనం రూ. వెయ్యి చెల్లించేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోందని, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో ఆదర్శ రైతుల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి, ప్రధాన కా ర్యదర్శి రమేశ్‌గౌడ్, దేవీదాస్, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top