లారీ ఢీకొని యువకుడి మృతి


జగిత్యాల రూరల్(కరీంనగర్): క్వారీలో పనిచేస్తున్న యువకుడు లారీ డ్రైవర్ అజాగ్రత్తకు బలయ్యాడు. లారీలోని లోడ్ దించిన తర్వాత డ్రైవర్ వాహనాన్ని ముందుకు పోనియడానికి బదులు ఒక్కసారిగి వెనక్కి రావడంతో.. అక్కడే నిల్చొని ఉన్న యువకుడు లారీ వెనక చక్రాల కింద పడి మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం అర్పపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.


వివరాలు.. గ్రామంలోని జోగుల పవన్ కుమార్(18) ఇటుక భట్టీలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ రోజు ఉదయాన్నే లారీ నుంచి బూడిద లోడ్ దించాక అక్కడే నిల్చొని ఉన్న లావన్ కుమార్‌ను ముందుకు వెళ్లాల్సిన లారీ వెనక్కి వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ చక్రాల కిందపడి మృతిచెందాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top