జీవితంపై విరక్తి చెంది..


పాన్‌గల్‌: చిన్న వయసులో అనారోగ్యం పాలయ్యానని జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఈ సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సువర్ణ, రమేష్‌ దంపతులు కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. కూతురు కృష్ణవేణి (19) తల్లిదండ్రులకు సహకరిస్తూ ఇంట్లోనే ఉండేది. అయితే కొన్నిరోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. దానికితోడు తరుచూ ఫిట్స్‌ రావడంతో అవమానంగా భావించేది.



ఈ నేపథ్యంలో బుధవారం ఇంట్లో ఎవరూలేనిది చూసి ప్యాన్‌కు ఉరివేసుకుంది. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ప్యాన్‌కు వేలాడుతున్న కూతురి మృతదేహాన్ని చూసి బోరును విలపించారు. అనారోగ్యాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top