రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ నేత మృతి
దండెపల్లి: వేగంగా వెళ్తున్న బస్సు,కారును ఢీ కొట్టడంతో టీఆర్ఎస్ నేత ఊరెల్లి లక్ష్మణ్ (58) మృతిచెందారు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం ముత్యంపేటలో చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి లక్సిట్టిపేట నుంచి నర్సాపూర్ వస్తున్న లక్ష్మణ్ కారును ఊట్నూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ముత్యంపేట వద్ద ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందగా.. ఆయన వెంట ఉన్న వెంగళరావుకు గాయాలయ్యాయి. నాయకుడి మృతితో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలుతీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.