బస్సు అదుపుతప్పి 8మందికి గాయాలు


బిక్నూరు : ప్రమాదవశాత్తూ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు వెళ్లడంతో 8మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బిక్నూరు వద్ద ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. 44వ నంబరు జాతీయ రహదారిపై భైంసా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు కిందికి వెళ్లింది. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top