డబ్బులివ్వలేదని తల్లిని చంపాడు..


తాగుడుకు డబ్బులివ్వలేదనే కోపంతో ఓ దుర్మార్గుడు.. కన్నతల్లినే పొట్టనబెట్టుకున్నాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా రాయదుర్గం మండలం ఐబీతండాలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. తండాకు చెందిన వడ్త్యా శంకర్‌నాయక్, తులసీబాయి(50) దంపతులకు ఇద్దరు కుమారులు. భర్త, పెద్ద కుమారుడు, కోడలు చెరుకు తోటలో పనికి వెళ్లగా తులసీబాయి, చిన్న కొడుకు నరేష్ ఇంట్లో ఉన్నారు.


జులాయి తిరుగుళ్లకు అలవాటు పడిన నరేష్...డబ్బుల కోసం తల్లిని వేధించటమే పనిగా పెట్టుకున్నాడు. అదే క్రమంలో ఆదివారం సాయంత్రం మద్యం తాగేందుకు కొడుకు డబ్బులడగ్గా తులసీబాయి నిరాకరించింది. ఇది మనసులో పెట్టుకున్న అతడు రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. సోమవారం ఉదయం గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. నరేష్‌ను అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top