వడదెబ్బతో వ్యక్తి మృతి


దాహేగాన్ (ఆదిలాబాద్ జిల్లా): వడదెబ్బతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా దాహేగాన్ మండలం మోటల్‌గూడ వద్ద జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన జానే దుర్గయ్య(45), తునీకాకులను సేకరించేందుకు వెళ్లాడు. ఈ క్రమంలోనే ఎండలో తిరగడంతో వడదెబ్బకు గురై మృతి చెందాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top