ఏప్రిల్ 4న హైదరాబాద్ లో నీటికి అంతరాయం


హైదరాబాద్: నగరానికి కృష్ణా ఫేజ్-3 నీరు ఏప్రిల్ 4 నుంచి సరఫరా కానుందని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ ఎండీ జగదీశ్వర్ అన్నారు. ఈ నీటి సరఫరా ప్రారంభం కారణంగా ఏప్రిల్ 4 న నగరానికి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. కృష్ణా ఫేజ్-1, ఫేజ్-2కి ఏప్రిల్ 4న కాకుండా 6న నీరు సరఫరా చేయనున్నట్టు చెప్పారు.


నీటి వినియోగదారులు పొదుపు చర్యలు పాటించి ఆరోజు సహకరించాలని జగదీశ్వర్ కోరారు. బస్తీలు, ఇతర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నట్టు తెలిపారు. కృష్ణా ఫేజ్-3 నీటిని రింగ్ మేన్-2 ద్వారా మాత్రమే ఏప్రిల్ 4న నీటి సరఫరా చేస్తామన్నారు. రింగ్మేన్-1 పనుల పూర్తికి మరో మూడు నెలలు సమయం పడుతుందని జగదీశ్వర్ అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top