పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం


నాగోలు (హైదరాబాద్) : పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం... ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన డి.కాజల్(14) సాగర్ రింగురోడ్డులోని ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. కాగా గత నెల 31న పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఆమె... తిరిగి ఇంటికి రాలేదు. చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో మంగళవారం కాజల్ సోదరుడు దీపక్ ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top