ఆటో బోల్తా: 9 మందికి గాయాలు


జగిత్యాల: వేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో 9 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం అనంతారం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా ముల్కలగూడెంకు చెందిన హనుమాన్ భక్తులు ఆటోలో కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తుండగా.. ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 


 

Read also in:
Back to Top