80 కేజీల గంజాయి స్వాధీనం
మెదక్ : మెదక్ జిల్లా న్యాల్కల్ వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బస్సులో తరలిస్తున్న 80 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు తమదైన శైలిలో వారిని విచారిస్తున్నారు.