8 కేజీల బంగారం స్వాధీనం
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో సోమవారం భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న 8 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అనుమానితుడు బంగారం ఉన్న బ్యాగ్ ను విమానంలోనే వదిలేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇతడికి సహకరించారనే అనుమానంతో కొంత మంది విమానాశ్రయ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కార్యాలయానికి తరలించారు. బంగారం స్మగ్లింగ్ తో వీరికేమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.