బస్సును ఢీకొన్న లారీ...8 మందికి స్వల్ప గాయాలు


రంగారెడ్డి: ఆగిఉన్న ఆర్టీసీ బస్సును వెనకవైపు నుంచి వస్తున్న లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 8 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన ధారూరు మండల పరిధిలోని అల్లిపూర్ బస్ స్టేజీ వద్ద బుధవారం సాయంత్రం 4:25 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. వికారాబాద్ నుంచి తాండూర్‌కు వెళుతున్న ఆర్డీనరీ బస్సు మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామ బస్‌స్టేజీ వద్ద ఆగింది. ఇదే సమయంలో వెనకనుంచి వస్తున్న ఎంహెచ్ 26 హెచ్ 5499 నంబర్ లారీ ఆగిఉన్న బస్సు వెనకబాగాన్ని ఢీకొంది.


ఈ ప్రమాదంలో బస్సు వెనకబాగంలో కూర్చున్న 8 మంది ప్రయాణికులకు స్వల్స గాయాలయ్యాయి. ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీడ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top