టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ


తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గొర్రెల పంపిణీ డ్రాలో తేడా రావడంతో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వివాదం చెలరేగింది. కోపోద్రిక్తులైన ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 8 మందికి గాయలు అయ్యాయి. క్షతగాత్రులను తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అతడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top