ఆటో బోల్తా: ఏడుగురికి గాయాలు


తుర్కపల్లి: నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో ఓ ఆటో బోల్తాపడింది. శుక్రవారం ఉదయం మండల కేంద్రంలోని హైదరాబాద్ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 మంది గాయపడ్డారు. అదే రహదారి పై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థతి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.



గాయపడిన వారిలో  6 మంది మండలంలోని దత్తాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కుషాయిగూడ నుంచి దత్తాయిపల్లికి  వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top