600 కిలోల బెల్లం పట్టివేత


డోర్నకల్(వరంగల్ జిల్లా): అక్రమంగా తరలిస్తున్న 600 కిలోల బెల్లాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన బుధవారం వరంగల్ జిల్లా డోర్నకల్లు మండలం ముల్కలపల్లి గ్రామంలో జరిగింది. అక్రమంగా బెల్లాన్ని ఆటోలో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీ చేసి పట్టుకున్నారు. ఆటోను సీజ్ చేసి అక్రమంగా తరలిస్తున్న బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో బెల్లం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top