119 గురుకుల పాఠశాలలు ప్రారంభం


కామారెడ్డి : ఈ ఏడాది 5,6,7,8 తరగతులు గురుకుల పాఠశాలలో ప్రారంభం కానున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి ఒక తరగతి చొప్పున పెంచుతామని చెప్పారు. కేజీ నుంచి పీజీ విద్యా పథకంలో భాగమే ఈ గురుకుల పాఠశాలలన్నారు. ప్రభుత్వం గురుకుల పాఠశాలలో చదివే ప్రతి విద్యార్ధిపై ఏడాదికి రూ. 1,20,000  ఖర్చు చేస్తున్నట్లు వివరించారు.

 

తరగతికి 80 మంది చొప్పున విద్యార్థులను చేర్చుకుంటున్నట్లు, ఈ రోజు 119 గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభం అయినట్టు వెల్లడించారు. భవిష్యత్తులో జనాభాకు అనుగుణంగా మరిన్ని గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తామని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లోని కార్పొరేట్ పాఠశాలలకు అనుగుణంగా గురుకులాలలో అంతే నాణ్యతతో ఇంగ్లీషు మీడియంలో బోధన జరుగుతుందని చెప్పారు. గురుకుల పాఠశాలల కోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయులను నియమిస్తామని తెలిపారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top