బైక్, ఆటో ఢీ : ఐదుగురికి గాయాలు


మహదేవ్‌పూర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్‌పూర్ - కాళేశ్వరం రహదారిలో ఎడపల్లి స్టేజ్ వద్ద శనివారం మధ్యాహ్నం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురికి గాయాలు అయ్యాయి. కాళేశ్వరం వైపు వెళుతున్న ఆటో- ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు కాగా, బైక్‌పై వస్తున్న కోటి చంద్రశేఖర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగిలిన వారికి మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top