తెలంగాణ సమస్యలపై 5 కమిటీల ఏర్పాటు


హైదరాబాద్: హైదరాబాద్ లో నిర్వహించిన తెలంగాణ జేఏసీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో  5 కమిటీలు ఏర్పాటు చేశారు.  ఉద్యోగులు, రైతులు, విద్యారంగం, తాగునీరు, రాష్ట్ర హైకోర్టు వంటి వివిధ విభాగాల్లోని సమస్యలను ఈ కమిటీలు అధ్యయనం చేస్తాయి.



ఉద్యోగుల సమస్యలపై   టీజేఏసీ నాయకుడు దేవీప్రసాద్, దళితుల సంక్షేమంపై మల్లేపల్లి లక్ష్మయ్య నేతృత్వంలో ఈ కమిటీలు పనిచేస్తాయి.  ఫిబ్రవరి 8వ తేదీ లోగా కమిటీలు నివేదిక సమర్పించాలని జేఏసీ తీర్మానించింది. అంతేకాకుండా రాష్ట్ర విభజన చట్టం అమలుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top