ఘోర అగ్నిప్రమాదం: 350 బైక్‌లు దగ్ధం


షాదన్‌గర్‌: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బస్టాండులోని తుల్జా భవాని, లక్ష్మీనరసింహ బైక్‌ పార్కింగ్‌ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 350 బైక్‌లు పూర్తిగా కాలిపోయాయని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో గతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండేది.  ఆ ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెను తొలగించేందుకు గ్యాస్‌ కట్టర్‌ ఉపయోగిస్తుండగా నిప్పు రవ్వలు పడి అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం. మొత్తం బైక్‌లు ఎన్ని తగులబడ్డాయో ఇంకా లెక్కింపు  పూర్తికాలేదు. నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top