నీటితొట్టెలో పడి బాలుడి మృతి


దమ్మపేట (ఖమ్మం) : ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు ప్రమాదవశాత్తూ నీటితొట్టెలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డ్ బజార్‌లో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. కాలనీలో నివాసముంటున్న దంపతులు గాజుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం భార్యాభర్తలు వ్యాపారానికి వెళ్లడంతో ఇంట్లో ఉన్న మూడేళ్ల బాలుడు ప్రశాంత్ ప్రమాదవశాత్తూ ఇంటి ముందు ఉన్న నీటి తొట్టెలో పడి మృతిచెందాడు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top