స్వైన్ఫ్లూతో మరో ముగ్గురు మృతి
స్వైన్ఫ్లూ లక్షణాలతో హైదరాబాద్లో ముగ్గురు వ్యక్తులు గురువారం మృతిచెందారు. గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు, ఉస్మానియా ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకూ స్వైన్ఫ్లూ మృతుల సంఖ్య 32కు చేరింది.
స్వైన్ఫ్లూ ప్రభావం తగ్గిందని నిమ్స్ డైరెక్టర్ నరేంద్రనాథ్ తెలిపి 24 గంటలు గడవకముందే మూడు మరణాలు చోటుచేసుకోవడం గమనార్హం. చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ స్వైన్ఫ్లూ మరణాలు కొనసాగుతుండడం ప్రజలను భయాందోళనలకు గురవుతున్నారు.