కారును ఢీకొన్న డీసీఎం.. ముగ్గురికి గాయాలు


వరంగల్: వేగంగా ప్రయాణిస్తున్న డీసీఎం వాహనం ఓ కారును ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం చింతకుంట క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. చింతకుంట ప్రాంతంలోని పెట్రోల్ బంక్ నుంచి బయటకు వస్తున్న కారుని డీసీఎం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.


ఈ ప్రమాదంలో కారు డ్రైవర్‌ తో పాటు అందులో ప్రయాణిస్తోన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వెంటనే అతన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top