రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు మృతి


కరీంనగర్ : కరీంనగర్లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లాలో తీగలగుట్టపల్లి వద్ద ఓ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రతిమ మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్థులు నవీన్(21), రాహుల్(22) , పేరు తెలియని మరో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని... మృతదేహాలను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top