శంషాబాద్ ఎయిర్పోర్టులో 3 కిలోల బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయం అధికారులు బుధవారం ఉదయం దుబాయి నుంచి వస్తున్న ప్రయాణికుడి నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి బెంగళూరు మీదుగా శంషాబాద్ చేరుకున్న విమాన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న మూడు కిలోల బంగారం ఓ వ్యక్తి వద్ద పట్టుబడింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
సంబంధిత వార్తలు