రెండు ద్విచక్రవాహనాలు ఢీ
బల్మూరు (మహబూబ్నగర్) : మహబూబ్నగర్ జిల్లా బల్మూరు మండలం చెన్నారం గ్రామ సమీపంలో మంగళవారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.