లోయలోకి దూసుకెళ్లిన కారు


అచ్చంపేట రూరల్ : మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట మండలంలోని ఉమామహేశ్వరం పుణ్యక్షేత్రంలో మూడవ మలుపు వద్ద ఓ కారు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బుచ్చయ్య అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా..మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. బాధితులంతా గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వారిగా గుర్తించారు. మద్దిమడుగు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అచ్చంపేట తరలించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top