లారీ కిందకు దూసుకెళ్లిన బొలెరో
కొత్తూరు: మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మంగళవారం ఉదయం కర్నూలు వైపు వెళుతున్న బొలెరో ట్రక్ అతివేగంతో అదుపుతప్పి ముందు వెళుతున్న లారీ కిందకు దూసుకెళ్లింది. బొలెరోలో ఎనిమిది మంది ప్రయాణిస్తుండగా ముందు వరుసలో కూర్చున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.