మహిళపై దాడి చేసిన ముగ్గురి అరెస్ట్


గచ్చిబౌలి (హైదరాబాద్) : ఓ మహిళపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను రాయదుర్గం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గచ్చిబౌలిలోని ప్రగతినగర్‌లో నివాసముంటున్న బి.వెంకటమ్మతో పక్కింట్లో నివాసం ఉండే వి.పాపమ్మ పార విషయమై ఈ నెల 30న గొడవపడింది. అనంతరం పాపమ్మ(35), ఆమె భర్త భద్రయ్య(45), మరిది ఎల్లయ్య(34)లు వెంకటమ్మపై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top