29 మంది మందు బాబులకు జరిమానా
దుండిగల్ (రంగారెడ్డి): మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 29 మందికి రంగారెడ్డి జిల్లా మేడ్చల్ కోర్టు జరిమానాలు విధించింది. జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ వేణుగోపాల స్వామి తెలిపిన వివరాల ప్రకారం... ఆది, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైై వ్లో 29 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిని మంగళవారం మేడ్చల్ మెట్రోపాలిటన్ ఏడవ సెషన్స్ కోర్టులో హాజరు పరిచారు.
వీరిలో 25 మందికి రూ.1,000 చొప్పున, మరొకరికి రూ.1500, మరో ముగ్గురికి రూ.2వేలతో పాటు ఒక రోజు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు.