26 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేత


 మహబూబ్‌నగర్ అర్బన్: జిల్లాలోని సబ్ రిఇస్ట్రార్ కార్యాలయాల్లో  భూములు, ఇతర విభాగాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 23వతేదీ నుంచి 26 వరకు నిలిపి వేస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సీసీఏ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, చేర్పులు చేయడానికి సంకల్పించినందున ఈ నాలుగు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల కార్య కలాపాలను నిలుపుదల చేస్తున్నామన్నారు. జిల్లా ప్రజలకు ఈ మార్పును గమనించాలని కోరారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top