ట్రాక్టర్ బోల్తా: 20 మందికి గాయాలు
నల్గొండ : అధిక వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ఇరవై మంది గాయపడిన సంఘటన నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గంజినగర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. హోళీ సంబురాల్లో పాల్గొనేందుకు దాదాపు 50 మందితో ట్రాక్టరులో దేవరకొండ నుంచి గంజినగర్ బయలుదేరారు. ఆ క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.