దోపిడీ దొంగల బీభత్సం:20 ఇళ్లల్లో చోరీ


వరంగల్:జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శుక్రవారం ఉదయం 20 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని, నగదును దోచుకెళ్లారు. ములుగు శివారు ప్రాంతంతో పాటు, ప్రేమ్ నగర్, జాకారంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 తులాల బంగారాన్ని, రూ. లక్ష నగదును అపహరించారు.


 


దొంగలను అడ్డుకున్నఒక జంటపై ఇనుప రాడ్లతో దాడి దిగారు. దీంతో వారికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఉదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గత నెలలో జిల్లాలో ఇదే క్రమంలో దోపిడి జరగడంతో దానిపై పోలీసులు దృష్టి సారించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top