బైక్, కారు ఢీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: మోటార్సైకిల్, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృత్యువాతపడగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మైసమ్మగడ్డ ప్రాంతానికి చెందిన చింతల శంకర్(28), మాదరబోయిన సిద్దిరాములు(35), శ్రీకాంత్ అనే వారు కార్మికులుగా పనిచేస్తున్నారు. ముగ్గురూ మోటారు సైకిల్పై వెళ్తూ 8.30 గంటల ప్రాంతంలో దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ సమీపంలో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు.
ఈ ఘటనలో శంకర్, సిద్దిరాములు అక్కడికక్కడే మృతి చెందగా శ్రీకాంత్ తీవ్రగాయాల పాలయ్యాడు.