రెండు బైక్ లు ఢీకొని ఇద్దరి మృతి
కరీంనగర్: రోడ్డుప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. హుస్నాబాద్ లో రెండు బైక్ లు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరొకరు గాయపడ్డారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.