రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి


వికారాబాద్ : రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం జిన్నారం గ్రామసమీపంలో దర్గా వద్ద వికారాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సును బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. జిల్లాలోని సలబత్తార్ గ్రామానికి చెందిన పృద్వీరాజ్(21), గోపాల్(27) అనే ఇద్దరు  యువకులు ఓ విందులో పాల్గొని బైక్‌పై స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top