భువనగిరిలో బాణసంచా పేలుడు, ఇద్దరు సజీవ దహనం!


భువనగిరి: ఓ ఇంట్లో నిలువ చేసిన బాణసంచా పేలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలోని ఆర్బీనగర్ లో చోటు చేసుకుంది. 

 

ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవదహనమైనట్టు సమాచారం. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. దీపావళి పండగ కోసం ఓ వ్యాపారి పెద్ద ఎత్తున తన నివాసంలో నిల్వ చేసిన బాణసంచా ప్రమాదవశత్తూ పేలడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top