విద్యుధ్ఘాతంతో తల్లీకూతురు మృతి
నారాయణపేట: మహబూబ్నగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుధ్ఘాతానికి గురై తల్లీకూతుళ్లు మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని నారాయణపేట మండలం జాజపూర్లో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ ఈ రోజు ఉదయం ఇంట్లో పని చేసుకుంటుండగా విద్యుధ్ఘాతానికి గురైంది.
ఇంటికి ప్రహరిగా ఏర్పాటు చేసుకున్న ఇనుప కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో అక్కడే పనిచేస్తున్న ఆమెకు కరెంట్షాక్ తగిలింది. ఇది గుర్తించిన ఆమె కూతురు తల్లిని రక్షించడానికి యత్నించి ఆమెకూడా మృతిచెందింది. విద్యుత్ తీగలు తెగి ఇనుప కంచెపై పడటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు.