రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
పుడూరు: వికారాబాద్ జిల్లా పుడూరు మండలం మన్నెగూడ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సోమన్గుర్తి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గురువారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంపై వెళుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు