నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం


సదాశివనగర్ : నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ వద్ద బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. సదాశివనగర్ మండలం కుప్రియాల్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top