ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్


నిజామాబాద్ (మాచారెడ్డి) : నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం ఆరేపల్లి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొట్టింది. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో వినయ్‌కుమార్(23), రాజనర్సు(22) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా..రాజ్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.



గాయపడిన రాజ్‌కుమార్ను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరు ముగ్గురూ బైక్‌పై మాచారెడ్డి నుంచి కామారెడ్డి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top