రూ. 5 లక్షల విలువైన గంజాయి పట్టివేత

రూ. 5 లక్షల విలువైన గంజాయి పట్టివేత - Sakshi


వరంగల్ : అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున వరంగల్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. వివరాలు..నాగపూర్‌కు చెందిన షేక్ సమీర్(33) 18 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడు. అతను నాగపూర్-బెంగళూరు సంగమిత్రా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ గంజాయి విలువ సుమారుగా రూ. 5 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.

(మత్తెవాడ)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top