బావిలో పడి బాలుడి మృతి
తాండూరు రూరల్: ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని పాతతాండూరులో శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.....పాత తాండూరుకు చెందిన గడ్డమిది హన్మంత్, సత్తమ్మ దంపతుల రెండవ కుమారుడు గడ్డమిది నరేష్(17). స్థానికంగా ఉన్న పాఠశాల్లో ఏడవ తరగతి వరకు చదువుకున్నాడు. చదువును మధ్యలో అపేసి పట్టణంలోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండటంతో నరేష్ బట్టల దుకాణంకు వెళ్లలేదు.
అయితే శనివారం తెల్లవారు జామున 3:30 గంటల ప్రాంతంలో బావిలో మృతదేహం లభ్యమైంది. బావిలో నుంచి స్థానికులు మృతదేహాన్ని బయటకు తెచ్చి చూడగా గడ్డమిది నరేష్గా గుర్తించారు. నరేష్కు ఈతరాదని...ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెంది ఉండొచ్చని కుటుంబ సభ్యులు తెలిపారు.