పిచ్చికుక్క దాడి: 15 మందికి గాయాలు


మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా గద్వాల మండలం చెనగోనపల్లెలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సోమవారం ఉదయం రోడ్డుపై వెళ్లే వారిపై దాడి చేసి గాయపర్చింది. కుక్క దాడిలో దాదాపు 15 మంది గాయపడ్డారు. వారిని స్ధానిక ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో స్ధానికులు భయాందళనకు గురయ్యారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top