యాదగిరిగుట్టకు వంద కోట్ల వెలుగులు


యాదగిరికొండ : నల్లగొండ జిల్లా రాయగిరి నుంచి యాదగిరిగుట్ట దేవస్థానం వరకు నాలుగు రోడ్ల నిర్మాణం, డివైడర్ల మధ్యలో రూ.110 కోట్లతో సెంట్రలైజ్డ్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ హర్షవర్దన్‌రావు తెలిపారు. యాదగిరిగుట్టలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.


తిరుపతి తరహాలో రాయగిరి నుంచి గుట్ట ఆలయం వరకు నాలుగు రోడ్ల రహదారుల మొత్తం 5.8 కిలోమీటర్ల దూరం 200 అడుగులుగా విస్తరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. దీని కోసం మొత్తం రూ.110 కోట్లతో సెంట్రలైజ్‌డ్ లైటింగ్ ఏర్పాటుకు పరిశీలన పూర్తి చేశారు. వీటి కోసం డిజైన్లు పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఈ పనులలో మొత్తం 25 మంది ఇంజనీరింగ్ అధికారులు పాల్గొంటారని వివరించారు. ఉగాదిలోగా పనులు పూర్తి చేయబోతున్నామని హర్షవర్దన్ రావు తెలిపారు.



 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top